- ఎస్బీఐ కార్డు యూజర్లకు హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీదారి అయినా ఎస్బీఐ కార్డు తన వినియోగదారులకు హెచ్చరికలు జారీచేసింది. బిట్కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఇలాంటి వాటిల్లో పెట్టుబడులకు తమ క్రెడిట్ కార్డు వాడాకాన్ని మాత్రం రద్దు చేయనప్పటికీ, యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు, ప్రజలకు జారీచేసిన ప్రకటనలో క్రిప్టోకరెన్సీ స్కీమ్లు, బిట్ కాయిన్ లాంటి ఇతర వర్చ్యువల్ కరెన్సీలకు ఎలాంటి లైసెన్సు లేదా అథరైజేషన్ ఇవ్వలేదని తెలుపుతూ ఎస్బీఐ కార్డు తన కస్టమర్లకు సందేశాలు పంపింది. అంతర్జాతీయంగా, స్థానికంగా వీటిపై ఆందోళనలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో కూడా ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైనవిగా గుర్తించడం లేదని తెలిపారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు ఐదు మిలియన్లు (50 లక్షల) మందికి పైగా కస్టమర్లున్నారు. కాగా ఈ నెల ప్రారంభంలోనే సిటీ ఇండియా బ్యాంకు తన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీలు లేదా వర్చ్యువల్ కరెన్సీలు కొనుగోలు చేయడాన్ని నిషేధించిన విషయం విదితమే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 20,2018 08:33PM