హైదరాబాద్: శంషాబాద్ గగన్ పహడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సెకండ్ సిఫ్ట్ పని జరుగుతున్న సమయంలో ఆయిల్ కొంచెం లీకేజ్ అయిన క్రమంలో.. అక్కడ పాత బట్టలు వేస్తారు. ఆ బట్టలపై ఎవరో సిగరెట్ పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ, ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm