అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణం వ్యవహారంలో ప్రధాన నిందితుడు గౌస్ పఠాన్ఖాన్ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుమారుడు మీరావలీ ఖాన్, అతని స్నేహితుడు, కంప్యూటర్ ఆపరేటర్ సందీప్ కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. ఎలాంటి ఆస్తులు లేనందునే నిందితులు ఇలాంటి కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ సందీప్, మీరావలి ఖాన్ను విచారిస్తే మరిన్ని వివరాల వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల హస్తం లేకపోవచ్చని పోలీసులు విస్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు ఏసురత్నం, రహముతుల్లా, తహసీల్దార్ సుబ్బిరెడ్డిలను మరోసారి విచారించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సీఆర్డీఏ కౌలు రూపంలో ఇచ్చిన రూ.1.15లక్షలను గౌస్ పఠాన్ ఖాన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm