కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఓ మహిళపై(20) ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్డును జొప్పించి హింసించారు. దక్షిణ దినాజ్పూర్లోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 17న శివరాత్రి ఉత్సవం నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న దేహబంద్కు చెందిన బాధితురాలిని దుండగులు అపహరించినట్లు దక్షిణ దినాజ్పూర్ ఎస్పీ ప్రసూన్ బెనర్జీ చెప్పారు. అనంతరం స్థానికంగా ఉన్న వంతెన కిందికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వంతెన కింద అపస్మారకస్థితిలో పడి ఉన్న ఓ మహిళను చూశాను. ఆమె మర్మాంగం నుంచి పేగు బయటికి రావడాన్ని గుర్తించి దవాఖానకు తరలించాను అని ధాము సోరెన్ అనే స్థానికుడు పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేహబంద్కు చెందిన రామ్ప్రబేశ్ శర్మతోపాటు కొందరు తనని ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొన్నారు. బాధితురాలికి మాల్దా దవాఖాన వైద్యుల బృందం రెండు శస్త్రచికిత్సలు నిర్వహించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 21,2018 06:41AM