మేడ్చల్: ఏపీ రాష్ట్రం కడప జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ట్రావెల్ బస్సులో 20 తులాల బంగారం నగలు అపహారణకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. కడప జిల్లా అయోధ్యపురం రామాపురంకు చెందిన శిల్పారెడ్డి జ్యోతిశ్వర్రెడ్డి దం పతులు కడప నుంచి హైదరాబాద్ కూకట్పల్లికు వస్తున్న జగన్ ట్రావెల్స్ ఏపీ 01 జే 5566 నెంబర్గల బస్సులో నగరానికి వస్తున్నారు. కాగా అదే బస్సులో శిల్పారెడ్డి జ్యోతిశ్వర్రెడ్డి దంపతులతో పాటు వారి సమీప బందువులు విగ్నేశ్వరీ, ఈశ్వర్రెడ్డి దంపతులు ఇతర ప్రాయాణీకులు బస్సులో ప్రయాణిస్తున్నారు. సదరు బస్సులో శిల్పారెడ్డి జ్యోతిశ్వర్రెడ్డి దంపతులకు చెందిన సుమారు 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక డైమండ్ ఉంగరం ఇతర వస్తువులు ఉన్న నీలం, ఎరుపు రంగు గల లగేజీ బ్యాగులను క్లీనర్ మహేష్ బస్సు డిక్కీలో భద్రపరిచాడు. మంగళవారం ఉదయం కూకట్పల్లి సుమిత్రనగర్లో బస్సు దిగిన అనంతరం లగేజీ బ్యాగులను చూడగా అందులో నీలం, ఎరుపు రంగు గల బ్యాగులు కనిపించలేదు. దీంతో సదరు దం పతులు దిగ్బ్రాందికి గురయ్యారు. లగేజీ బ్యాగులో బద్రపరిచిన బంగారు ఆభరణాలు, డైమండ్ ఉంగరం వారికి కనిపించలేదు. దీంతో కంగారు పడిన శిల్పారెడ్డి జ్యోతిశ్వర్రెడ్డి దంపతులు బస్సు డిక్కీలో లగేజీ బ్యాగులు బద్రపరిచిన క్లీనర్ మహేష్పై అనుమానంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm