విశాఖ: విశాఖపట్టణంలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్ లోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 50 మందికి గాయాలు కగా, పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. యాక్సిడెంట్ కారణంగా ఎన్ఏడీ జంక్షన్ లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm