హైదరాబాద్: విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 23న న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 అమల్లో తలెత్తుతున్న సమస్యలతోపాటు షెడ్యూల్ 9, 10ల్లోని సంస్థల విభజన, షెడ్యూల్-13లో ఇచ్చిన హామీలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఉద్యోగుల విభజన, ప్రభుత్వ భవనాల అప్పగింత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎస్లు దినేశ్ కుమార్ (ఏపీ), ఎస్కే జోషి (తెలంగాణ), ఇతర అధికారులు హాజరు కానున్నారు. మరోవైపు, తెలంగాణ సచివాలయంలో ఈనెల 27న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం కూడా జరగనుంది. ఇందులో విద్యుత్ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు రూపొందించాలన్న హైకోర్టు తీర్పుబీ తెలంగాణ రిలీవ్ చేసి, మళ్లీ జాయిన్ చేసుకున్న సెక్షన్ ఆఫీసర్లు, ఏపీలో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల విభజన చర్చకు రానున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm