అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 190 కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి రెండోతేదీ వరకు జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4,46,833మంది హాజరుకానున్నారు. బుధవారం రాత్రి వరకు 97.76శాతం మంది హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 21-24వ తేదీ వరకు పేపర్-1, ఈనెల 25నుంచి 28వరకు పేపర్-2, మార్చి ఒకటి, రెండున పేపర్-3 నిర్వహిస్తారు. భాషాపండితుల అభ్యర్థులు తక్కువగా ఉన్నందున వచ్చే నెల రెండున అదనపు సెషన్స్ కింద పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటిసారిగా ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm