హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనకు నేటితో ఐదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనఖీలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ ఆ భీతావాహక ఘటన ఈ ప్రాంత వాసుల కళ్ల ముందు కదలాడుతోంది. బిడ్డలను కోల్పోయిన తల్లులు, కుటుంబసభ్యలు ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
2013, ఫిబ్రవరి 21 రాత్రి ఏడు గంటలకు దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్ సమీపంలో కొద్ది నిమిషాల్లో వ్యవధిలోనే రెండు చోట్ల బాంబులు పేలాయి. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 138 మంది గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు ఘటనా స్థలిలో లభించిన ఆధారాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఎన్ఐఏ కోర్టు 2016, డిసెంబర్ 19న వారిని దోషులుగా తేలుస్తూ ఉరిశిక్షను ఖరారు చేసింది. ఉరిశిక్ష పడిన వారిలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన అసదుల్లా అక్తార్ అలియాస్ హడ్డీ, పాకిస్తాన్కు జియా ఉర్ రహ్మన్ అలియాస్ వాఖస్, బీహార్కు చెందిన మహమ్మద్ తహాసీన్ అక్తార్, కర్నాటకకు చెందిన మహమ్మద్ అహ్మద్ సిదిబాప అలియాస్ యాసిన్ భత్కల్, మహారాష్ట్రకు చెందిన ఎజాజ్ సయీద్ షేక్ ఉన్నారు. కాగా నిందితులు వేరే కేసుల్లో ఉండటంతో ఉరిశిక్ష అమలు కాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 21,2018 08:15AM