యాదాద్రి: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలోని కొండ కింద పార్కింగ్ చేసిన సుమో వాహనం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ జరగలేదు. అప్పటికే వ్యాన్లో నిద్రిస్తున్న డ్రైవర్ వెంకన్న ప్రాణాలు దక్కించుకున్నాడు. వాహనం దగ్ధమయ్యే సమయంలో పక్కనే పార్కింగ్ చేసిన మిగతా వాహనాలను పోలీసులు, స్థానికులు హుటాహుటిన తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm