చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు. పార్టీ ప్రారంభ వేడుకకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm