హైదరాబాద్: నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వీసా గడువు ముగిసినా నగరంలో నివసిస్తున్న వారిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆఫ్రికా, నైజీరియా, సూడాన్, ఉగాండా దేశస్థులను గుర్తించేందుకు ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, గోల్కొండ, టోలీచౌకీలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వీసా గడువు ముగిసిన 250 మందికిపైగా విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm