అలీఘర్: ఉత్తరప్రదేశ్లో ఓ తండ్రి తన 20 ఏళ్ల కూతుర్ని గన్తో కాల్చి చంపేశాడు. ఈ ఘటన అలీఘర్లో జరిగింది. తన ప్రమేయం లేకుండా పెళ్లి కుదర్చడం వల్ల అమ్మాయి ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తన కూతురు ఇళ్లు వదిలి వెళ్లడం వల్ల మనస్తాపానికి గురైన తండ్రి ఆమెను పిస్తోల్తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతను పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడి సోదరుడు పోలీసులకు ఈ ఘటన పట్ల ఫిర్యాదు చేశాడు. ఆవేశంతోనే తండ్రి కూతుర్ని హత్య చేశాడని పోలీసులతో పేర్కొన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm