ఫతేబాద్: హర్యానాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఖుషీ ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాసింది. అస్తవ్యస్తంగా ఉన్న తమ గ్రామంలోని రోడ్లను పక్కారోడ్లుగా మార్చాలని అందులో కోరింది. ఈ లేఖ రాసిన నెలరోజుల వ్యవధిలోనే ప్రధాని కార్యాలయం నుంచి దీనికి సానుకూల స్పందన వచ్చింది. ఖుషి పెన్సిల్తో తన నోట్ బుక్లోని పేపర్పై ఈ ఉత్తరాన్ని రాసింది. కుటుంబసభ్యుల సాయంతో దానిని ప్రధాని కార్యాలయానికి పంపింది. సత్తా టిబ్బాగ్రామం నుంచి ఠాణీ తేజ్సింగ్ గ్రామం వరకూ గల 3 కిలోమీటర్ల రోడ్డను పక్కారోడ్డుగా మార్చేందుకు ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ గ్రామ రహదారిని బాగు చేయాలని పలుమార్లు గ్రామస్థులు ప్రభుత్వానికి మొరపెట్టకున్నారు. అలాగే ఖుషీ కూడా ఈ రోడ్డు మీదుగా పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. గ్రామానికి పక్కారోడ్డు మంజూరైనందుకు స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm