హైదరాబాద్: మెట్రో రైలులో వెళ్లే ప్రయాణీకులకు రెండు ప్రధాన సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో ఒకటి పార్కింగ్ ప్రాబ్లం అయితే.. మరొకటి టాయిలెట్స్ ప్రాబ్లం. ఈ దెబ్బతో ఈ రెండు సమస్యలు తీరిపోనున్నాయి. ఈ రెండింటిని పరిష్కరించే దిశగా మెట్రో అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్తో జరిగిన సమావేశంలో అధికారులు వెల్లడించారు.
మెట్రో రైలు కార్యకలాపాలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు సమీక్షించారు. బేగంపేట మెట్రోరైల్ భవన్లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో పనితీరును మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వేన్సీని పెంచేందుకు ప్రయత్నించాలని అధికారులను అదేశించారు. త్వరలోనే ఫ్రీక్వెన్సీతోపాటు రైళ్ల వేగం పెంచడంతో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని మెట్రోరైల్ యండి ఎన్వీయస్ రెడ్డి మంత్రికి తెలిపారు. ఇతర మెట్రోలతో పొల్చితే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య బాగుందన్నారు. చెన్నయ్ లాంటి నగరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రయాణీస్తున్న సంఖ్యతో పొల్చితే నగర మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రారంభం నాటి నుంచి ఇప్పటిదాకా ఏలాంటి సమస్యలు లేకుండా మెట్రో కార్యకలాపాలు నడుస్తున్నాయన్నారు. మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి అదేశించారు. అర్టీసీతోపాటు ఇతర అంశాలను పరిశీలించాలన్నారు. ఇందుకోసం సెట్వీన్ వంటి సంస్ధల అధ్వర్యంలో నూతనంగా వంద ఎలక్ర్టిక్ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను తెలపాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 21,2018 11:43AM