ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ, డిప్రషన్కు గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. రాత్రి భార్య ఇంటికి తిరిగివచ్చేసరికి భర్త ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దత్తాత్రేయ(32) దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా దత్తాత్రేయ చనిపోయేముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు. 'నేను విముక్తి కోసం ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయిన తరువాత ఎవరినీ ఇబ్బందులకు గురిచేయవద్దు' అని దానిలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm