ఢిల్లీ: ప్రయాణికుల భద్రత కోసమే ఇంజిన్లలో లోపం తలెత్తున్న ఎ320 నియో విమానాలను నిలిపేస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. విమానయాన సంస్థలు వీలైనంత త్వరగా వాటి స్థానాల్లో వేరే విమానాలను భర్తీ చేస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల వైఫల్యాల నేపథ్యంలో ఎ320 నియో విమానాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. డీజీసీఏ ఆదేశాల మేరకు నిన్న ఇండిగో, గోఎయిర్ విమానయాన సంస్థలకు చెందిన 14 విమానాలను నిలిపేసింది. దీంతో ఈరోజు ఇండిగో, గోఎయిర్లు వివిధ రూట్లలో ప్రయాణించాల్సిన ఎ320 నియో విమానాలు నిలిచిపోవడంతో దాదాపు 65 సర్వీసులను రద్దు చేశాయి. కేవలం ప్రయాణికుల భద్రత కోసమే ఈ విధంగా చేస్తున్నామని, దీన్ని విమానయాన సంస్థలు పాజిటివ్గా తీసుకోవాలని ప్రభు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm