నిడహాస్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లదేశ్ అభిమానుల మధ్య తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. చివరి బంతివరకు విజయం దోబూచులాడగా, క్రికెట్ అభిమానులకు మాత్రం పసందైన క్రీడా విందు లభించింది. చివరి బంతికి దినేష్ కార్తీక్ సిక్స్ తో విజయం సాధించగానే టీమిండియా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. రోహిత్ కెప్టెన్సీలో సిరీస్ విజయం సాధించడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా అభిమాని అయిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ భారత విజయానికి ముగ్ధుడై ట్విట్టర్ లో రెండు ఓవర్లలో 24 పరుగులు సాధించాలి, నరాలు తెగే ఉత్కంఠ..ఐదు పరుగులు ఒక్క బంతి.. అద్భుతంగా ఆడావ్ దినేష్ కార్తీక్ ఇంక్రిడబుల్, శుభాకాంక్షలు అంటూ తొలి ట్వీట్ చేశారు. అందులో అంకెలు తప్పుగా ఉండడాన్ని గమనించి, మరో ట్వీట్ లో తొలి ట్వీట్ లో 24కి బదులుగా 34 అని చదవండి.. దినేశ్ కార్తీక్ సారీ అని పేర్కొన్నారు. దినేష్ కార్తీక్ ప్రదర్శన పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబునిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm