ఢిల్లీ: ఏదో ఒక నెపంతో సభ వాయిదా వేస్తూ తప్పుడు చేస్తున్నారని, అవిశ్వాసం చర్చకొస్తుందని ప్రతి రోజు ఎదురు చూస్తున్నట్లు వైసీపీ ఎంపీ వరప్రసాద్ రావు పేర్కొన్నారు. ధైర్యం ఉంటే అవిశ్వాసంపై చర్చకు అవకాశం ఇవ్వాలని, చంద్రబాబు రోజుకో మాట మాట్లాడడం సబబు కాదన్నారు. మూడేళ్లు ప్యాకేజీ అడగి హోదాను హేళన చేశారని, ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే అవిశ్వాసంపై పోరాడలేమన్నారు. ఆఖరి అస్త్రంగా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని, టీఆర్ఎస్ ఎంపీలు అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm