న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ను అనర్హుడుగా ప్రకటించాలంటూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. బిహార్ ఎన్నికల సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగానూ..ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సీఎం నితీశ్పై ఓ క్రిమినల్ కేసు పెండింగ్లో ఉందని, ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చలేదని శర్మ ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm