ముంబై: ప్రముఖ నటి స్వర్గీయ శ్రీదేవి దేశానికి ఏం సేవలు చేసిందని ఆమె మృతదేహంపై త్రివర్ణ పతాకం కప్పి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ప్రశ్నించారు. శ్రీదేవి మృతి చెందిన తరువాత ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాటు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై థాకరే నిప్పులు చెరిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో విదేశాలకు పరారైన నీరవ్ మోడీనుంచి మీడియా దృష్టి మరల్చడానికే శ్రీదేవికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. మీడియా బిజెపి ప్రభుత్వంనుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నదని ఆయన అన్నారు. శ్రీదేవి మృతి చెందే వరకూ దేశవ్యాప్తంగా నీరవ్ మోడీ అంశమే చర్చలో ఉందని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm