కోల్కతా: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత బెనర్జీతో భేటీ కానున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం థర్డ్ ఫ్రంట్ లేదా మరో ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు ఆరంభించిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 19,2018 02:32PM