రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. దాణా స్కామ్కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ నేత జగన్నాథ మిశ్రాను మాత్రం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేతలు ఇటు మోడీతో పాటు అటు నితీశ్ కుమార్పై ఘాటుగా స్పందించారు.
Mon Jan 19, 2015 06:51 pm