ముంబయి: స్టాక్మార్కెట్లపై 'అవిశ్వాస' ప్రభావం కొనసాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో గత శుక్రవారం భారీగా కుదేలైన స్టాక్మార్కెట్లు సోమవారం కూడా ఆ నష్టాల నుంచి కోలుకోలేకపోయాయి. దీనికి తోడు వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికా ఫెడ్ సమావేశం కూడా మార్కెట్ను వెంటాడాయి. దీంతో నేడు కూడా సూచీలకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు కోల్పోయి 33వేల దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 10,100 మార్క్ను నిలబెట్టుకోలేకపోయింది.
ఈ ఉదయం సూచీలు లాభాలతో మొదలైనప్పటికీ.. మదుపర్ల అమ్మకాల ఒత్తిడితో ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్300 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయ్యాయి. చివరకు కాస్త కోలుకున్నా నష్టాలు తప్పలేదు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్ల నష్టంతో 32,923 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 10,94 వద్ద స్థిరపడ్డాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 19,2018 04:08PM