హైదరాబాద్ : తమ శాసనసభ సభ్యత్వాన్ని టీఆర్ఎస్ సర్కార్ శాశ్వతంగా రద్దు చేయటంపై కోమటిరెడ్డి, సంపత్ లు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారికి ఊరట లభించింది. ఆరు వారాల పాటుఈసీ నోటిఫికేషన్ ఇవ్వరాదని హైకోర్టు వారికి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. కాగా మండలి చైర్మన్ స్వామిగైడ్ పై కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసరటాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వీరిద్దరి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమకు న్యాయం జరపాలంటు వారు కోర్టును ఆశ్రయించిన క్రమంలో వారికి స్వల్పంగా ఊరట లభించింది.
Mon Jan 19, 2015 06:51 pm