అమరావతి: హోదా కోసం ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పిన జనసేన అధినేత పవన్కల్యాణ్ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలా ఎందుకు మాట్లాడారో తెలియదని సీపీఎం నేత మధు చెప్పారు. హోదాకు కట్టుబడి ఉంటామనే పవన్ తమతో చెప్పారని, ఆ వ్యాఖ్యలు చూడకుండా తానేమీ మాట్లాడలేనన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్ని నిజమేనని, ఏప్రిల్ నుంచి ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మధు స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ...కేంద్రంలో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రజలకు దూరమవుతున్నాయని మధు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించిన పవన్.. ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి నిధులు రావడమే ముఖ్యమని ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతామని చెప్పిన పవన్ ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. బీజేపీని అనుసరించే పవన్ ఇలా మాట్లాడి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm