న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మరో ఇద్దరికి క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే అకాలీదళ్ నేత బిక్రం మజిథియాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్ తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్కు కూడా సారీ చెప్పారు. దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు నితిన్ గడ్కరీయేనంటూ గతంలో కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం గడ్కరీ, కేజ్రీవాల్ ఢిల్లీ పటియాల కోర్టులో నడుస్తున్న పరువునష్టం దావా కేసును ముగించాలంటూ అభ్యర్థనలు దాఖలు చేశారు. తనపై ఆరోపణలు చేసినందుకు గడ్కరీ ఈ దావాను కేజ్రీవాల్పై వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm