హైదరాబాద్ : ముషీరాబాద్ లో బీఎల్ఎఫ్ కార్యాలన్ని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వామపక్ష భావజాలం వున్న సంఘలతో కూడిన బహుజన లెఫ్ట్ పార్టీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబీఎల్ఎఫ్ ను బలోపేతం చేసేందుకు నేతలు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2017లో సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రభుత్వ హామీలు, అమలు డిమాండ్లతో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర వేలాది కిలో మీటర్లు కొనసాగి విజయవంతంగా ముగిసింది. దీన్ని పురస్కరించుకుని మహా పాదయాత్ర ముగింపు వార్షికోత్సవ సభను నిర్వహించారు. అనంతరం బీఎల్ఎఫ్ కార్యాలయాన్ని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm