హైదరాబాద్ : దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి సమావేశమయిన అనంతరం ఇరువురు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశాభివృద్ధి, రైతు సమస్యలపై కూడా చర్చించామని మమతా తెలిపారు. భవిష్యత్తులో థర్డ్ ఫ్రంట్ బలమైన కూటమిగా అవతరించబోతోందనిఈ సందర్భంగా మమతా మాట్లాడుతు...భవిష్యత్తులో మాది బలమైన ఫెడరల్ కూటమిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సందర్భంగా ఈరోజు సీఎం కేసీఆర్ మమతా బెనర్జీతో సమావేశమయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్ సెక్రటేరియట్ లో దాదాపు మూడు గంటలపాటు సమావేశం అనంతరం ఇరువురు ప్రెస్ మీట్ లో పలు విషయాలను వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm