హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జాతీయ చానెల్కు న్యూస్-18 ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదని, రాష్ట్రానికి నిధులు రావడమే ముఖ్యమని అన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటన చేసిన పవన్ కల్యాణ్... ఇప్పుడు ఇలా నిధులు అంటూ మాట్లాడడం ఏంటని ఏపీ మంత్రి అమరనాథరెడ్డితో పాటు పలువురు విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్.. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది. ఃఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జనసేన కట్టుబడి ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని న్యూస్ 18 రిపోర్టర్ పొరపాటుగా అర్థం చేసుకున్నారుః అని అందులో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm