హైదరాబాద్ : దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించేందుకు కోల్కతా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమెతో భేటీ ముగిసిన తరువాత కాళీమాత ఆలయానికి వెళ్లారు. తన వెంటన వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో ఆయన కోల్కతా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలు దేరనున్నారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విషయంపై కేసీఆర్ త్వరలోనే మరికొందరు నేతలతో చర్చలు జరపనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm