న్యూఢిల్లీ: కర్నాటక క్యాబినెట్ లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పార్టీ మండిపడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్టు పార్టీ జనరల్ సెక్రటరీ, కర్నాటక బీజేపీ పార్టీ ఇన్చార్జీ పి. మురళిధర్ రావు ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందకుగానూ అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో విభజన రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm