హైదరాబాద్ : వైసీపీ అధినేతజగన్ ని జనసేన అధినిత పవన్ కల్యాణ్ ని కలిపేంత సమర్థత తనకు లేదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. '2019 ఎన్నికల నేపథ్యంలో జగన్ ని పవన్ ని కలిపే ప్రయత్నాలు మీరు చేస్తున్నారటగా' అనే ప్రశ్నకు ఆయన సమాధానిమిస్తూ, 'అంతా ఒట్టిదే. నేను అంత ఆలోచన చేయలేదు. వారిని కలిపేంత సమర్థత నాకు లేదు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ పెద్ద బిజినెస్. ఈ ఏడాది బడ్జెట్ లో ఎనభై లేదా తొంభై కోట్లు జీతాలకు పోతే మిగిలేది లక్షా పదివేల కోట్లు. దీని కోసం ఈ దెబ్బలాట అంతా! దీనిపై పెత్తనం చంద్రబాబునాయుడు చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఈ పెత్తనం చేయడం కోసం ఈ ఫైటింగ్ జరుగుతోంది. ఆ పెత్తనం చేసే క్రమంలో కొంత పర్సంటేజ్ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్లకు వస్తుంది. దాన్ని వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెడతారు. కాంట్రాక్టర్లు రూలింగ్ పార్టీకి రూపాయి ఇస్తే, అపోజిషన్ పార్టీకి అర్థరూపాయి ఇస్తారు' అని చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm