కడప: ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిన అనంతరం.. బీజేపీ-టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాపై.. మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లలో మిత్రపక్షానికి బీజేపీ చుక్కలు చూపింది. కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించకుంటే అమిత్షాకైనా చెక్ తప్పదు. వైసీపీ అవిశ్వాసాన్ని మేం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కంటే ఓటర్లు తెలివైన వాళ్ళు. ప్రశాంత్ కిశోర్ ట్రిక్కులు పనిచేయవుఁ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm