ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సీఎం కేసీఆర్ కలవడం ఓ స్టంట్ మాత్రమేనని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలవనే లేదు.. అప్పుడే ఫ్రంట్ ఏమిటి? అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు నామమాత్రంగా నడుపుతూ కోల్కతాలో పర్యటిస్తున్నారని అన్నారు. శాసనసభకు విలువ లేనట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రతిపక్షం వైపు ఉన్నారో, ఎన్డీయే వైపు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేను వ్యతిరేకిస్తున్న పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశాన్ని తెచ్చారని విమర్శించారు. మంత్రి ఆదేశాల మేరకు కమీషన్లు తీసుకుంటున్నామని ఒక మున్సిపల్ ఛైర్పర్సన్ చెప్పారని ఉత్తమ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేటీఆర్కు లేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm