ఈరోజుల్లో జుట్టు రాలడం... తెల్ల బడిపోవడం చాలా సాధారణ సమస్య. ఈ సమస్య మిమ్మల్నీ వేధిస్తోందా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొన్ని సూచనలు పాటించాలి. అవేంటో చూడండి.
ముఖ్యంగా మీ ఆహారంలో మంచి పోషక విలువలుండేలా చూసుకోవాలి.
రోజు విడిచి రోజు మాడుకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుని వేడిగా ఉన్న టవల్ తలకు చుట్టుకోవాలి. ఒక గంట తరవాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుంది.
వెనుకటి రోజుల్లో తలస్నానానికి ముందు తలకు ఆముదం పట్టించేవాళ్లు. ఇలా చేయడం వలన జుట్టు నల్లబడటమేకాక, ఒత్తుగా పెరిగేది. అందుకే వారానికోసారి రెండు చెంచాల ఆముదంలో కోడిగుడ్డు పచ్చసొని, ఒక స్పూన్ తేనె వేసి కలిపి మాడుకు పట్టించి, మూడు గంటల తరవాత తలస్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెలో ఉసిరికాయ పొడి కలిపి మాడుకు మర్దనా చేయాలి.
మెంతులను ముందు రోజు రాత్రి నానబెట్టి మెత్తని పేస్ట్లా చేసి తలకు పట్టించి ఒక అరగంట తరవాత తలస్నానం చేస్తే నిర్జీవంగా ఉన్న జుట్టు మాములుగా అవుతుంది.
చుండ్రు సమస్య ఉన్నవారు పైన చెప్పిన వాటిలోనే కొంచెం నిమ్మరసం కూడా చేర్చితే చుండ్రు తగ్గుతుంది!
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 19,2018 09:44PM