ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మండల కేంద్రంలో 10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ కలకలం సృష్టించింది. ఓ వ్రైవేటు స్కూల్లో ప్రశ్నాపత్రం లీక్ అవుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్వశ్చన్ పేపర్ ను ప్రింట్ తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా జగిత్యాల జిల్లాలో క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందనే సమాచారంతో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గౌడ్ మాస్ కాపీయింగ్ కు పాల్పడిన నేపథ్యంలో సివిల్ డ్రస్ లో వెళ్లి చాకచక్యంగా కొడిమ్యాల ఇంచార్జ్ సతీస్ పట్టుకున్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm