ఢిల్లీ : అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ సమావేశాలలో నోటీసులిచ్చింది. ఆందోళనల మధ్య గత నాలుగు రోజుల ఉభయసభలలోను కొనసాగతున్న వాయిదాల పర్వం ఈరోజుకూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారానాకి రాజ్యసభ, మంగళవారానికి లోక్ సభలు వాయిదా పడ్డాయి. కాగా ఇప్పటి వరకూ టీడీపీ,వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవిశ్వాసన తీర్మానాన్ని స్పీకర్ కు అందజేశారు. 27న తిరిగి ప్రారంభమయ్యే సభా కార్యకలాపాలలో అవిశాస నోటీసులను చేర్చాలని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ సెక్రటరీ జన్ రల్ కు అవిశ్వాస నోటీసును అందజేసింది. కాగా తిరిగి ప్రారంభం కానున్న సభల్లో అవిశ్వాస తీర్మానాలపై సీన్ రిపీట్ కానుందా? లేదా ఎన్డీయే మరోవ్యూహం ఏమిటా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm