నిజామాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చాను. జిల్లా అభివృద్ధిలో ముందుండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. గతంలో ఎన్నడూరానన్ని నిధులను తీసుకువస్తున్నాం. అభివృద్ధి పనులను చేస్తున్నాం. నగరంలోని అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం. పసుపు రైతులను ఆదుకుంటామని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్, పెద్దపల్లి రైల్వేలైన్ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చానన్నారు. రైల్వే పనులను పూర్తిచేశానన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నేరవేర్చానన్నారు. రైల్వే లైన్ 22 ఏళ్లుగా పెండింగ్లో ఉంటే పనులన్నీ పూర్తి చేశానన్నారు. ఈ రైల్వేలైన్ ద్వారా భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm