హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. ఎయిర్పోర్టు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm