ఖమ్మం : మధిర మండలంలోని జిలుగుమాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మధిర నుంచి వైరాకు స్కూటిపై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వచ్చిన బుల్లోరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm