ముంబయి: అలనాటి బాలీవుడ్ నటి జీనత్ అమన్ ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల రోజులుగా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని అసభ్యకర ఫొటోలు పంపుతుండేవాడని చెప్పారు. కాగా..కొన్ని నెలల క్రితం జీనత్ ఇదే విషయంలో ఓ కేసు పెట్టారు. అయితే అందులో తనపై అత్యాచారానికి పాల్పడిన విషయాలేవీ వెల్లడించలేదు. జీనత్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో సత్యం శివం సుందరం, కుర్బానీ, అజ్నబీ తదితర చిత్రాల్లో జీనత్ నటించారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలపై ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ఇటీవల అలనాటి నటుడు జితేంద్రపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 40 ఏళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారంటూ జితేంద్ర బంధువు ఒకరు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm