ఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ డేర్డెవిల్స్ సారథి గౌతమ్ గంభీర్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. 2011 నుంచి కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన గంభీర్ ఈ ఏడాది తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.
జనవరిలో జరిగిన వేలంలో కనీస ధర రూ.2కోట్లకు ఢిల్లీ డేర్డెవిల్స్ సొంతం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ జట్టుకు గంభీర్ నాయకత్వం వహిస్తాడని ఆ జట్టు ఫ్రాంఛైజీ నిర్వాహకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7నుంచి ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ ఫ్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో గంభీర్ తన కుటుంబసభ్యులతో కలిసి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. టోర్నీలో భాగంగా ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ను ఢీకొట్టనుంది. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 05:48PM