హైదరాబాద్ : లోక్సభలో టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాటకాలు ఆడుతున్నారని ఏపీసీసీ విమర్శించింది. ఈ రోజు ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేరిట విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రెస్నోట్ విడుదలైంది. మోదీ తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రాభవం కోసం మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అవసరమైతే రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అల్లర్లు సృష్టించి, ఏపీని మరోసారి విభజించైనా సరే లబ్ది పొందాలని ఆశిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 06:43PM