న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు కుమార్ కేత్కర్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మహారాష్ట్ర నుంచి ఆయన పోటీపడ్డారు. 'దైనిక్ దివ్య మరాఠి' చీఫ్ ఎడిటర్ అయిన కేత్కర్ 'ఎకనామిక్ టైమ్స్', మహారాష్ట్ర వార్తాపత్రిక 'లోక్సత్తాఃకు కూడా పనిచేశారు. నెహ్రూ, గాంధీ వారసత్వాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందంటూ గతంలో ఆయన విమర్శలు గుప్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm