కోల్కతా: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ శుక్రవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. సచివాలయంలో వీరిరువురు దాదాపు 10 నిమిషాలపాటు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ కేసుపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా హసీన్కు సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసును విచారించిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు బృందం షమీకి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. షమీపై వచ్చిన ఆరోపణలు తప్పని తేలడంతో బీసీసీఐ తిరిగి షమీ కాంట్రాక్ట్ను పునరుద్ధరించింది. షమీపై హసీన్ జహాన్ పలు ఆరోపణలు చేశారు. ఆమె ఫిర్యాదుతో షమీపై కోల్కతా పోలీసులు గృహ హింస, హత్యాయత్నం తదితర కేసులను నమోదు చేశారు. ఇందులో భాగంగా షమీ, హీసన్లను ఇప్పటికే విచారించారు.
Mon Jan 19, 2015 06:51 pm