న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ అడ్డుకుంటుందని ఆయన అన్నారు. అన్నాడీఎంకే బీజేపీ చెప్పు చేతుల్లో నడుస్తుందని చెప్పారు. అవిశ్వాసం విషయంలో ప్రభుత్వం పారిపోయిందని, దిగివచ్చి సమస్య పరిష్కరించేంతవరకు పోరాటం చేస్తామని రమేశ్ తెలిపారు. నాలుగేళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనిపించని అవినీతి ఇప్పుడు కనిపిస్తుందా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందని వెల్లడించారు. బీజేపీ ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని సీఎం రమేశ్ అన్నారు. రెండోసారి తనను రాజ్యసభకు పంపినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కి ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm