హైదరాబాద్: బ్యాంకులకు రూ.313 కోట్ల మేర టోపీ పెట్టిన టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను సీబీఐ ఈ రోజు అరెస్టు చేసింది. బ్యాంకులను మోసగించారన్న అభియోగాలపై గురువారం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కంపెనీ తమను రూ.313.84 కోట్ల మేర మోసగించిందని పేర్కొంటూ హైదరాబాద్లోని యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంపెనీ, దాని ఇద్దరు డైరెక్టర్లు, మరికొందరిపై సీబీఐ కేసులు పెట్టింది. ఈ సంస్థ మొత్తం ఎనిమిది బ్యాంకులు, ఆర్థిక సంస్థల సమాఖ్యకు రూ.1394.43 కోట్ల మేర బకాయి పడినట్టు సీబీఐ నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm