విశాఖ: ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ కలకం రేపుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రజలందరూ ముందుకు రావాలని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి లేఖలో కోరారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీ ప్రజలను మోసం చేశాయని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు ప్రత్యేకహోదా అంటున్నారని పేర్కొన్నారు. మరో బూర్జువా పార్టీ సభ్యులు రాజీనామాలు చేస్తామంటున్నారని చెప్పారు. పెట్టుబడిదారుల హోదా వద్దని.. ప్రజల హోదా కావాలని చంద్రమౌళి స్పష్టం చేశారు. ఎన్నికలు లాబీయింగ్ ద్వారా కాకుండా పోరాటం ద్వారా సాధించాలని ఆయన పిలుపు నిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm