అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా రాసిన లేఖపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్ర సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా అమిత్షా లేఖ రాశారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అన్ని పనులకు సంబంధించి యూసీలు ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించినట్లు తెలిపారు. యూసీ సర్టిఫికెట్లకు, ప్రత్యేక హోదాకు సంబంధమేంటని ప్రశ్నించారు. హోదాతో సహా మిగిలిన 18 హామీలు నెరవేర్చడానికి యూసీ అవసరమా? అని అడిగారు. ఎన్డీయే నుంచి బయటకొచ్చేందుకు ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారని అమిత్షా లేఖలో పేర్కొన్నారని.. తాము తీసుకున్న నిర్ణయం ఆవేశపూరిత నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశాక కూడా ఎన్డీయేలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అనేక పర్యాయాలు ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారని చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో అమిత్షాకు సీఎం లేఖ రూపంలో సమాధానమిస్తారని లోకేశ్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm